Home  »  TGPSC 2022-23  »  Indian Polity-10

Indian Polity-10 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల హక్కులను ఏ ఛాంబర్ ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది?

  1. లోక్ సభ
  2. రాజ్యసభ
  3. రాష్ట్ర శాసనసభ
  4. రాష్ట్ర శాసన మండలి
View Answer

Answer: 2

రాజ్యసభ

Explanation:

  • పార్లమెంటులో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం
  • భారత పార్లమెంటులోని రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
  • పార్లమెంటు రూపొందించే శాసనాల విషయంలోనూ మరియు రాజ్యాంగ సవరణల విషయంలోనూ రాజ్యసభ రాష్ట్రాలహక్కులను సంరక్షించుటకు కృషి చేస్తుంది.

Question: 2

అధికార భాగస్వామ్యానికి సంబంధించి కింది ప్రకటన(లు)లో ఏది సరైనది?
ఎ. శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు సమాంతరంగా అధికారాన్ని పంచుకుంటాయి.
బి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వం అధికారాన్ని నిలువుగా పంచుకుంటాయి.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Question: 3

భారత హైకోర్టుకు సంబంధించి కింది ప్రకటన(లు)లో ఏది సరైనది?

ఎ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 125 హైకోర్టులకు సంబంధించినది.
బి. హైకోర్టు రిట్ అధికార పరిధి సుప్రీంకోర్టు కంటే పెద్దది.

సి. సాయుధ దళాలతో వ్యవహరించే కోర్టులు మినహా మిగిలిన అన్ని కోర్టులు మరియు ట్రిబ్యునల్లపై హైకోర్టుకు పర్యవేక్షణ అధికారం ఉంటుంది.
ఎంపికలు :

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 2

బి మరియు సి మాత్రమే

Explanation:

  • రాజ్యాంగంలో హైకోర్టు గురించి తెలియజేసేవి భాగం : 6, ఆర్టికల్ : 214 – 231
  • ప్రతి రాష్ట్రం లో హైకోర్ట్ ఉంటుంది . రాష్ట్రం లో హైకోర్ట్ అత్యున్నత న్యాయస్థానం
  • ప్రస్తుతం దేశంలో 25 హైకోర్ట్ లు ఉన్నాయి

అధికారాలు, విధులు

  • పార్లమెంటు మరియు రాష్ట్ర శాసన సభలకు హైకోర్టు యొక్క అధికార పరిధి తగ్గించే లేదా పెంచే అధికారం కలదు.

ప్రారంభప్రాథమిక అధికారం:

  • ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నిక వివాదాలు, ప్రాథమిక హక్కు ల పరిరక్షణ, కోర్టు దిక్కారం వంటి కొన్ని వివాదాలను నేరుగా హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి.

 అప్పీళ్ళు – అధికార పరిధి :

  • అప్పీళ్లకు సంబంధించి రాష్ట్రంలో హైకోర్టు అత్యున్నత మైంది. సివిల్, క్రిమినల్ కేసుల్లో కింది కోర్టు ఇచ్చిన తీర్పులను హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు.

రిట్లు – అధికార పరిధి :

  • రాష్ట్ర సరిహద్దు లోపల ఉన్న వ్యక్తులకు, సంస్థలకు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు వివిధ రిట్లను జారీ చేస్తుంది. రిట్లు జారీ చేసే అధికారాల విషయంలో సుప్రీంకోర్టు కు ఉన్న అధికారాల కంటే హైకోర్టుకు ఉన్న అధికారాలే ఎక్కువ. హైకోర్టులు ప్రాథమిక హక్కుల రక్షణకే కాక ఇతర అంశాలకు సంబంధించి కూడా రిట్లు జారీ చేయవచ్చు.

Question: 4

కింది వాటిలో ఏ దేశం మరియు ప్రభుత్వ రూపం సరిగ్గా సరిపోలింది?

ఎ. భారతదేశం – ప్రతినిధి ప్రజాస్వామ్యం
బి. ఇంగ్లాండ్ – రాజ్యాంగ చక్రవర్తి
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Explanation:

  • భారతదేశం ప్రజాస్వామ్యదేశం. విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, ఆకాంక్షలు గల సమాజంలో ప్రజలందరి అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాల్సి వుంటుంది.
  • భారతదేశంలోని పౌరులకు రెండు మార్గాలు వున్నాయి.
  1. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
  2. మెజారిటీ పరిపాలన.
  • ప్రాతినిధ్య ప్రభుత్వం: ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ ప్రాతినిధ్య ప్రభుత్వాలే. ఈ విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు.
  • ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ ద్వారా ప్రతినిధులు ఎన్నికవుతారు.
  • భారతదేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకొంటారు.
  • మెజారిటీ పరిపాలన: ఎన్నికల ముందు వివిధ అభ్యర్ధులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితాను ఓటర్ల ముందు వుంచుతారు. ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకోవాలో ఓటర్లకు ఇది ఉపయోగపడుతుంది.
  • ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి రాజ్యాంగచట్టంలో కొన్ని నిబంధనలను పొందుపరిచారు. వారు ఆ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినపుడు న్యాయస్థానాలు రాజ్యాంగం ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం వుంది
  • అలాగే ప్రజలు ఎవరైనా, ఎపుడైనా ప్రజా ప్రతినిధుల పనులను విమర్శించవచ్చు.

సమానత్వం – ప్రజాస్వామ్యం:

  • ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపట్లా వాళ్ళకు అవగాహన కలిగివుండాలి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహకరించాలి. ఓటు వేసేటపుడు నిర్భయంగా, ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వెయ్యాలి. దురదృష్టవశాత్తు అన్నిసమయాలలో ఇలా జరగటం లేదు.
  • ప్రజలకు ప్రజాస్వామ్య విలువలపట్ల అవగాహన లేకపోవడానికి నిరక్షరాస్యత కూడా ఒక కారణమే. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా ఉపయోగించుకోవటం లేదు.
  • చాలా సందర్భాలలో ప్రజలను ఎన్నికల సమయంలో చిన్న చిన్న ప్రలోభాలకు గురిచేసి ధనవంతులు ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు.
  • కొన్ని సందర్భాలలో కులం, మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజలమీద ఎక్కువ ప్రభావం చూపుతోంది. అప్పుడు ప్రజలు తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువ
  • ప్రభుత్వం వివిధ స్థాయిలలో స్థానికంగాను, రాష్ట్ర స్థాయిలోను, జాతీయస్థాయిలోను పనిచేస్తుంది.

Question: 5

అప్రజాస్వామిక ప్రభుత్వ విధానం గురించి కింది వాటిలో సరైనది ఏది ?

  1. చట్టం మరియు రాజ్యాంగ సూత్రం గౌరవించబడుతుంది.
  2. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రజల భాగస్వామ్యం ఉంది.
  3. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది.
  4. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోదు.
View Answer

Answer: 4

ప్రభుత్వం ప్రజలను పట్టించుకోదు.

Explanation:

  • భారత రాజ్యాంగం ప్రాతినిధ్య పార్లమెంటరీ తరవా ప్రజాస్వామ్యాన్ని ఏర్పరుస్తుంది. దీని ప్రకారం కార్యనిర్వాహక శాఖ తాను తీసుకున్న విధానాలకు చర్యలకు శాసనసభకు బాధ్యత వహిస్తుంది.
  • సార్వజనీన వయోజన ఓటుహక్కు విధానం, నిర్దిష్ట కాలంలో ఎన్నికలు, సమన్యాడు పాలన న్యాయవ్యవస్థ, స్వాతంత్ర్యం, సహేతుకత లేని వివక్షతను రూపుమాపటం వంటి ప్రజాస్వామ్య అంశాలు భారత రాజకీయ వ్యవస్థలో ఉన్నాయి.
  • ప్రవేశికలో ఉన్న ‘ప్రజాస్వామ్య’ అనే వదం రాజకీయ ప్రజాస్వామ్యానికే కాక, సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యానికి కూడా వర్తిస్తుంది.
Recent Articles