Home  »  TGPSC 2022-23  »  Indian Polity-10

Indian Polity-10 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది ఏ జంట ఆర్టికల్ – ప్రొవిజన్ సరిగ్గా సరిపోలింది?

ఎ. ఆర్టికల్ 16 – కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం లేదా వాటిలో దేని ఆధారంగానైనా రాష్ట్రం ఏ పౌరుడిపైనా వివక్ష చూపకూడదు.
బి. ఆర్టికల్ 15 – ఏ పౌరుడు కేవలం మతం, జాతి, కులం, లింగం, – సంతతి, పుట్టిన ప్రదేశం, నివాసం లేదా వాటిలో దేనిపైనా వివక్ష చూపకూడదు.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు.
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Explanation:

  • రాజ్యాంగంలో 3 వ భాగంలో ఆర్టికల్ 12-35 వరకు  ప్రాథమిక హక్కులు  పొందుపరిచారు

సమానత్వపు హక్కు(14-18)

  • 14. చట్టం ముందు అందరూ సమానులే.
  • 15. పౌరులను జాతి, కుల, మత, లింగ, జన్మ స్థలం  కారణా లను బట్టి వివక్ష చూపరాదు.
  • 16. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు – జాతి, కుల, మత, లింగ, జన్మ స్థలం  నివాస స్థలం ,సంతతి (వంశ పారం పర్యం అనే వివక్ష్త లు ఉండవు)
  • 17. అంటరానితనాన్ని నిషేధిస్తుంది.
  • 18. బిరుదులు, కీర్తి చిహ్నాలను నిషేధిస్తుంది

Question: 7

భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో దత్తత తేదీని పేర్కొన్నారు?

  1. పీఠిక
  2. ప్రాథమిక హక్కులు
  3. ప్రభుత్వ విధానాల ఆదేశిక సూత్రాలు
  4. ప్రాథమిక విధులు
View Answer

Answer: 1

పీఠిక

Explanation:

  • భారత రాజ్యాంగం ప్రవేశక (పీఠిక) తో ప్రారంభమవు తుంది.
  • ప్రవేశిక రాజ్యాంగం యొక్క లక్ష్యాలను, మూల తత్వాన్ని తెలియజేస్తుంది
  • ప్రవేశిక భారత రాజ్యాంగానికి పరిచయం వంటిది.
  • రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను అమెరికా రాజ్యాం గం నుండి గ్రహించారు.
  • భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక (సార్వభౌమ), సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణ తంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతం త్య్రాన్ని అంతస్తులలోను అవకాశాలలోను సమా నత్వాన్ని చేకూర్చడానికీ, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ వేళ తేది 26, నవంబర్ 1949న రాజ్యాంగ పరిషత్లో ఆమోదించి శాసనంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాం.

Question: 8

ఈ క్రింది వాటిలో ఏ జత వ్యాసాలు మరి దాని నిబంధనలు

ఎ. ఆర్టికల్ 169 – ఏ శాసనసభ అయినా ప్రత్యేక మెజారిటీతో శాసనమండలిని ఏర్పాటు చేసుకుని రద్దు చేయవచ్చు.
బి. ఆర్టికల్ 171 – మండలి పరిమాణం 40కి తగ్గకుండా, మొత్తం అసెంబ్లీ సభ్యుల్లో మూడో వంతుకు మించకుండా ఉండాలి.
ఎంపికలు

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదుయు
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Explanation:

విధానపరిషత్ ఏర్పాటు/రద్దు గురించి ఆర్టికల్ 169

  • దీని ప్రకారం రాష్ట్ర విధానసభ 2/3వ వంతు మెజా రిటీతో ఒక ప్రత్యేక తీర్మానం చేసినపుడు ఆ తీర్మా నాన్ని పార్లమెంట్ ధ్రువీకరిస్తే రాష్ట్రపతి ఎగువ సభను ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.

విధాన పరిషత్ నిర్మాణం

  • ఆర్టికల్ 171 ప్రకారం విధాన పరిషత్ నిర్మాణం గురించి తెలుపుతుంది
  • 1950 ప్రజా ప్రతినిత్య చట్టం ప్రకారం సభ్యులా సంఖ్య కనిష్టంగా 40,గరిష్టంగా రాష్ట్ర విధాన సభ సంఖ్యలో 3 వ వంతుకి మించరాదు

Question: 9

పంచాయితీ రాజ్ సంస్థలను ప్రవేశపెట్టడం ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమం అమలును అనుసరించింది?
ఎ. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్

బి. నేషనల్ ఎక్స్ టెన్షన్ సర్వీసెస్ ప్రోగ్రామ్
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Explanation:

  • 1951లో ప్రవేశపెట్టిన మొదటి ప్రణాళిక, 1952లో ప్రవేశపెట్టిన సామాజిక అభివృద్ధి పథకం, 1953లో ప్రారంభించినజాతీయ విస్తరణ సేవా పథకాల అమలు తీరును పర్యవేక్షించుకోవాల్సిన ఆవశ్యకతను జాతీయ అభివృద్ధి మండలి, ప్రణాళిక సంఘం గుర్తించాయి.
  • ఇందుకోసం 1957లో కేంద్ర ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 1957 చివరిలో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. పంచాయతీరాజ్ వ్యవస్థను వెంటనే స్థాపించాలని ప్రతిపాదించింది.
  • 1952లో ప్రవేశపెట్టిన పథకంతో సహా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యమౌతుందని, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఇందుకు పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పడమే ఏకైక పరిష్కారమని సూచించింది.
  • బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనలను కేంద్ర ప్రభుత్వం, జాతీయాభివృద్ధి మండలి ఆమోదించడంతో స్థానిక స్వపరిపాలన సంస్థల ఏర్పాటుకు సరైన దృక్పథంతో పునాదులు వేశారు.
  • 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో అప్పటి ప్రధాని నెహ్రూ మొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించారు.
  • పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1959 నవంబర్ 1 మహబూబ్నగర్లోని షాద్నగర్ ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవస్థను అమలు చేసిన రెండవ జిల్లా శ్రీకాకుళం.

Question: 10

పంచాయతీ రాజ్ సంస్థలను దాని పదవీకాలం ముగిసేలోపు ఎవరురద్దు చేయవచ్చు?
ఎ. యూనియన్ ప్రభుత్వం
బి. రాష్ట్ర ప్రభుత్వ
ఎంపికలు:

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 2

బి మాత్రమే

Explanation:

243 (E) అధికరణ – పదవీకాలం

  • పంచాయితీరాజ్ సంస్థల పదవి కాలం 5 సంవత్సరాలుగా నిర్ణయించారు.
  • 5 సంవత్సరాల పదవీ కాలం ముగియక ముందే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దుచేయవచ్చును. ఏ కారణం చేతనైనను పదవీకాలం ముగియకముందే ఒకవేళ వాటిని మధ్యలోనే రద్దుచేసినట్లయితే 6 నెలల్లోగా తప్పని సరిగా ఎన్నికలు నిర్వహించాలి.
  • ఖాళీ లేర్పడినపుడు జరిగే ఉప ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే ప్రతినిధులు మిగిలిన పదవీ కాలానికి మాత్రమే అధికారంలో కొనసాగుతారు.
  • సంస్థ మొత్తానికి ఎన్నికలు కాలయాపన ద్వారా జరిగితే పూర్తి పదవీ కాలం అధికారంలో కొనసాగవచ్చును.
  • ఆ సంస్థ పదవీకాలం ముగియటానికి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఉపఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు.

 

Recent Articles